- Advertisement -
కోల్కతా : పశ్చిమ బెంగాల్లో అక్రమ బొగ్గు తవ్వకం, రవాణాకు సంబంధించిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహిస్తోంది. మంగళవారం తెల్లవారుజామున నుంచే ఈడీ పది ప్రదేశాల్లో సోదాలు ప్రారంభించింది. బెంగాల్ పోలీస్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ మనోరంజన్ మండల్, కిరణ్ఖాన్, సేఖ్ అక్తర్, ప్రబీర్ దత్తా, మీర్జా హేసాముద్దీన్ బేగ్ వంటి వారితో సహా ఈ కేసుతో సంబంధం ఉన్న మరికొందరి ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నట్టు ఈడీ అధికారులు తెలిపారు. పశ్చిమ బెంగాల్లో జరిగిన బొగ్గు అక్రమ రవాణా రాకెట్పై చాలా సంవత్సరాలుగా కేంద్ర దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే నేడు ఈడీ సోదాలు జరుగుతున్నాయి.
- Advertisement -



