- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సాయిబాబా ఆలయం సమీపంలో యూ-టర్న్ తీసుకుంటున్న ట్రావెల్స్ మినీ బస్సును వెనుక నుంచి టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు స్వల్పంగా దెబ్బతిన్నంది. ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణికులు లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
- Advertisement -



