- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : చైనాలో భారీ భూకంపం సంభవించింది. చైనాలోని క్వింఘై ప్రావిన్స్లో బుధవారం ఉదయం 5:36 గంటల సమయంలో భూమి కంపించింది. భూకంప తీవ్రత 5.6 మ్యాగ్నిట్యూడ్ గా నమోదైందని చైనా ఎర్త్ క్వెక్ నెట్ వర్క్ సెంటర్ తెలిపింది. భూకంప కేంద్రం భూమికి కేవలం 10 కిలో మీటర్ల లోతులో ఉందని వెల్లడించింది. ఆస్తి, ప్రాణ నష్టానికి సంభంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు.
- Advertisement -


