- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణపై నేడు తుది నిర్ణయం తీసుకోనున్నట్టుు తెలుస్తోంది. ఈ అంశాలపై నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేసీ వేణుగోపాల్తో భేటీలో చర్చించారు. ఇక ఈ రోజు ఆయన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో చర్చించనున్నట్టు సమాచారం. మంత్రి వర్గ విస్తరణలో భాగంగా ఐదుగురు కొత్తవారిని క్యాబినెట్లోకి తీసుకోవాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే రెండు నెలల క్రితం మంత్రి వర్గ విస్తరణపై కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ, ఖర్గేతో రాష్ట్ర నేతలు పలు దఫాలుగా సమావేశం అయ్యారు. ఇప్పుడు సీఎం భేటీ అవ్వడంతో మంత్రివర్గ విస్తరణ హాట్ టాపిక్ గా మారింది.
- Advertisement -