– ప్రధానోపాధ్యాయులు హరిత
నవతెలంగాణ – అశ్వారావుపేట
పుస్తకం అత్యంత విలువైనదని జ్ఞాన సంపాదనకు పుస్తక పఠనం ఒక్కటే మార్గమని, విద్యార్ధులు పాఠకుడిని ఆలోచింపచేసే విధంగా పుస్తక సమీక్షలు చేశారని విద్యార్ధి దశలోనే పుస్తక సమీక్షలు చేయడం అభినందనీయమని అన్నారు. స్థానిక జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి.హరిత అధ్యక్షతన గురువారం పుస్తక సమీక్షకుల సమావేశం నిర్వహించారు.
పాఠశాల గ్రంధాలయం లో విద్యార్ధులు చదివిన పుస్తకాలపై విద్యార్ధి సమీక్షకులు పుస్త సమీక్షలు చేశారు.స్నేహం, అడవి జంతువుల కథలు,తెనాలి రామకృష్ణ కథలు,పూతరేకులు,అంబేద్కర్ వంటి పుస్తకాలపై విద్యార్ధులు తమదైన శైలిలో సమీక్షలు చేశారు. గ్రంధాలయ పుస్తకాలు తమకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని విద్యార్ధులు అంటున్నారు.విద్యార్ధులనుద్దేశించి ప్రధానోపాధ్యాయురాలు హరిత మాట్లాడుతూ..సమీక్షకుల క్లబ్ లో ఎక్కువ మంది సభ్యులు చేరేలా చూడాలని అన్నారు.
అనంతరం పుస్తక సమీక్షలు చేసిన విద్యార్థిని విద్యార్ధులు తహసీన్, వీక్షిత,సంజన ,వీరేన్, సాయి కౌషిక్,చరణ్ తేజ లకు బహుమతులు అందచేశారు. ఈ కార్యక్రమంలో సి.ఆర్.పి ప్రభాకరాచార్యులు, భాషోపాధ్యాయులు పుల్లయ్య, రమాదేవి లు పాల్గొన్నారు.



