దీనిపై మున్సిపల్ ఎన్నికల తర్వాత చర్చించేందుకు సిద్ధం: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్
నవతెలంగాణ-కాగజ్నగర్
తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణానికి తమవంతు పూర్తి సహకారమందిస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శనివారం కుమురంభీం- ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్కు వచ్చారు. ఎస్పీఎం క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడారు. మహారాష్ట్రకు పక్కనే ఉన్న తెలంగాణపై తమకు అభిమానం ఉందని, ఇక్కడ ప్రాజెక్టు నిర్మాణం ద్వారా రెండు లక్షల ఎకరాలకు సాగు నీరందించేందుకు పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పారు.
2016లో అప్పటి సీఎం కేసీఆర్తో గోదావరి నదీజలాల ఒప్పందంపై చర్చలు జరిపి సమస్యను పరిష్కరించుకున్న విషయాన్ని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వ నిధులు నేరుగా పంచాయతీలకు ఎలా వస్తున్నాయో, అదేవిధంగా మున్సిపాలిటీలకు కూడా కేంద్రం నిధులు రానున్నట్టు తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్రావు, ఎమ్మెల్సీ మల్క కొమురయ్య, ఎంపీ నగేష్, ఎమ్మెల్యే హరీష్బాబు మాట్లాడారు. ముందుగా ఆసిఫాబాద్, కాగజ్నగర్ మున్సిపాలిటీలలో పోటీచేసే అభ్యర్థులను ఎమ్మెల్యే హరీష్బాబు మహారాష్ట్ర సీఎంకు పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు ధోని శ్రీశైలం, మాజీ అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్, నాయకులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణానికి సహకారమందిస్తాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



