ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు
మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలి : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ- నసురుల్లాబాద్(బాన్సువాడ)
‘పోచారం శ్రీనివాస్రెడ్డి కేసీఆర్ పార్టీకి వెన్నుపోటు పొడిచారు. బాన్సువాడ మున్సిపాలిటీకి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ రూ.625 కోట్లు కేటాయించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పోచారం ఒక్క రూపాయి అయినా తెచ్చారా?..’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ప్రశ్నించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో శనివారం రోడ్షోలో పాల్గొన్నారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. బీఆర్ఎస్ హయాంలో బాన్సువాడకు రూ.కోట్ల నిధులు మంజూరు చేయగా.. ప్రస్తుత ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి కాంగ్రెస్ నుంచి ఒక్క రూపాయి తేలేదని విమర్శించారు. తాను మున్సిపల్ మంత్రిగా ఉన్న సమయంలో బాన్సువాడకు మున్సిపాలిటీ హోదా కల్పించానని గుర్తు చేశారు.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోచారం శ్రీని వాస్రెడ్డిని ఓడించడానికి రేవంత్రెడ్డి తిట్టినా.. ప్రస్తుతం ఇద్దరూ ఒక్కటయ్యారని విమర్శించారు. ప్రాణం ఉన్నంత వరకు కేసీఆర్ వెంటే ఉంటానని చెప్పిన పోచారం మాట తప్పి.. కాంగ్రెస్ గూటికి చేరి బీఆర్ఎస్ పార్టీకి వెన్నుపోటు పొడిచారన్నారు. బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధికి కేసీఆర్ రూ.10వేల కోట్లు ఇచ్చారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు గడుస్తున్నా ఇచ్చిన హామీలు ఒక్కటీ నెరవేర్చలేదని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గట్టి బుద్ధి చెప్పాలని కోరారు. బీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటేసి గెలి పించాలని పిలుపునిచ్చారు. హామీలు నెరవేర్చకుండా కాంగ్రెస్ నాయకులు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగడానికి వస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు ఒక్కటేనని ఆరో పించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, అంజిరెడ్డి, జుబేర్, ధర్మతేజ, నార్ల రత్నకుమార్, ఎలమంచిలి శ్రీనివాసరావు, బోడ చందర్, మోచి గణేష్, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.



