- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: హర్యానా సోనిపట్ సమీపంలో నేషనల్ హైవే 44 పై ఉన్న భిగాన్ టోల్ ప్లాజా వద్ద పై టోల్ ఫీజు చెల్లించాలని కోరినందుకు 10-12 మంది యువకులు సిబ్బందిపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. నాలుగు కార్లలో వచ్చిన నిందితులు, బారియర్లను తొలగించి దౌర్జన్యంగా వెళ్లేందుకు ప్రయత్నించారు. అడ్డుకున్న ఇద్దరు ఉద్యోగులను కర్రలతో బాదడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీలో రికార్డయ్యాయి.
- Advertisement -



