- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. జగ్గయ్యపేట నుంచి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఇంజిన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే బస్సును రోడ్డుకు పక్కకు ఆపారు. ముందు మార్గం నుంచి ప్రయాణికులు బయటకు వెళ్లగా, మరికొందరు అత్యవసర మార్గం ద్వారా కిటికిల్లోంచి బయటకు దూకారు. భయాందోళనలతో ప్రయాణికులు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
- Advertisement -



