- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : అమెరికా సైన్యానికి చెందిన అపాచీ హెలికాప్టర్ సోమవారం హర్మూజ్ జలసంధి సమీపంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్లోని ఇద్దరు సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారని, వారికి ఎటువంటి గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ధృవీకరించారు. న్యూయార్క్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ట్రంప్, “పైలట్లు క్షేమంగా ఉన్నారు, ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు” అని పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన అధికారిక నివేదికను మంగళవారం విడుదల చేస్తామని ఆయన తెలిపారు.
- Advertisement -



