- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: మద్యం ప్రియులకు త్వరలో షాక్ తగలనుంది. లిక్కర్ ధరల పెంపునకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన నివేదికను ఎక్సైజ్ శాఖ కొన్నివారాల కిందటే సీఎంఓకు అందజేసింది. సమ్మర్ ముగిసిన వెంటనే మద్యం ధరలు పెంచనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది. జూన్ 15న లేదా 3వ వారంలో మద్యం ధరలను 15-20% వరకు పెంచే ప్రతిపాదనకు సీఎం రేవంత్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఈ మేరకు ఎక్సైజ్ అధికారులకు సమాచారం అందింది.
- Advertisement -



