- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: నారాయణపేట జిల్లాలో, మంత్రి వాకిటి శ్రీహరి పార్టీ సీనియర్ నాయకులతో కలిసి మక్తల్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లను నిర్ణయించారు. మక్తల్ మున్సిపల్ చైర్మన్గా వాకిటి మానస, వైస్ చైర్మన్గా శైనిరెడ్డిని ప్రకటించారు. మక్తల్ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 15 వార్డులకు గాను 12 వార్డులను గెలుచుకుని పూర్తి మెజారిటీ సాధించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ మక్తల్ మున్సిపాలిటీలో జెండా ఎగురవేసింది.
- Advertisement -



