- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : నల్లగొండ కార్పొరేషన్ మేయర్గా 32వ డివిజన్ విజేత బుర్రి చైతన్య శ్రీనివాస రెడ్డి ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్గా 45వ డివిజన్ నుంచి గెలుపొందిన మహమ్మద్ అస్రఫ్ అలీ అమేర్ ఎన్నికయ్యారు. కాగా నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మొత్తం 48 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ అద్భుత ప్రదర్శన కనబరిచింది. కాంగ్రెస్ 35 స్థానాల్లో విజయం సాధించగా.. బీఆర్ఎస్ 10 స్థానాలు, బీజేపీ 02, స్వతంత్రులు ఒక స్థానంలో విజయం సాధించారు.
- Advertisement -



