- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ అధినేత మమతా బెనర్జీ ఓటమి చెందిన విషయం తెలిసిందే. ఆమె పోటీ చేసిన రెండు స్థానాల నుంచి పరాజయం పొందారు. పోలింగ్ విధానంలో బీజేపీ అక్రమాలకు పాల్పడిందని పలుమార్లు ఆరోపించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన నెలన్నర రోజుల తర్వాత తాను పోటీచేసిన భవానీపూర్ స్థానంలో ఫలితాన్ని సవాల్ చేస్తూ టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ కలకత్తా హైకోర్టును ఆశ్రయించారు. మంగళవారం ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భవానీపూర్ నియోజకవర్గంలో సీఎం సువేందు అధికారి.. మమతను 15,105 ఓట్ల తేడాతో ఓడించారు.
- Advertisement -



