- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : వనమహోత్సవం కార్యక్రమానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నేడు రంగారెడ్డి జిల్లా గుర్రంగూడ ఎకో పార్కులో ఈ వనమహోత్సవం-2026 కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించి, నాగలింగం మొక్కను నాటనున్నారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 16.06 కోట్ల మొక్కలు నాటే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకుంది. ఇందుకోసం 13,242 నర్సరీల్లో మొక్కలు సిద్ధం చేశారు. అలాగే ఇవాళ రూ.35.50 కోట్ల అభివృద్ధి పనులకు కూడా సీఎం శ్రీకారం చుట్టనున్నారు.
- Advertisement -



