- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్ నాంపల్లి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అగ్ని ప్రమాదంలో కీలక మలుపు చోటుచేసుకుంది. 1,100 ఫైల్స్ దగ్ధం అయినట్లు నాగ్ పూర్ ప్రత్యేక బృందం గుర్తించింది. 1,100 కేసుల డేటా రికవరీ కోసం ఈ టీమ్ యత్నించింది. అయితే కేసుల డేటా రికవరీ కష్టం అని ప్రత్యేక బృందం తేల్చేసింది. కాగా దీనిపై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగుతోంది.
- Advertisement -



