Saturday, February 21, 2026
E-PAPER
Homeజాతీయంఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుళ్లకు లష్కరే కుట్ర!

ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుళ్లకు లష్కరే కుట్ర!

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఢిల్లీలోని ఎర్రకోట, చాందినీ చౌక్‌లోని ఒక ఆలయం, దేశవ్యాప్తంగా ఉన్న ఇతర ప్రధాన దేవాలయాల సమీపంలో పేలుళ్లు జరపాలని పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా ప్లాన్ చేస్తోందని సమాచారం. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని ఒక మసీదులో ఫిబ్రవరి 6న జరిగిన పేలుడుకు ప్రతీకారంగా ఈ దాడులకు ప్లాన్ చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందినట్లు తెలుస్తోంది.

భద్రతా సంస్థల సమాచారం ప్రకారం, లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఈడీ) ద్వారా దాడికి కుట్ర పన్నుతున్నట్లు తెలిసింది. ఫిబ్రవరి 6న ఇస్లామాబాద్‌లోని మసీదులో జరిగిన పేలుడుకు ప్రతీకారం తీర్చుకోవడమే ఈ కుట్ర వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని భద్రతా బలగాలు వెల్లడించాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -