నవతెలంగాణ-హైదరాబాద్: ఇజ్రాయిల్ సైన్యం శుక్రవారం లెబనాన్లోని తూర్పు బెకా లోయలో దాడులు జరిపింది. ఈ దాడుల్లో పది మంది మృతి చెందారు. ముగ్గురు చిన్నారులతో సహా 24 మంది గాయాలపాలయ్యారని లెబనీస్ ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. బెకా లోయలో హెజ్బుల్లా గ్రూపు సైనిక స్థావరాల్ని లక్ష్యంగా చేసుకుని తాము వైమానిక దాడులకు పాల్పడినట్లు ఇజ్రాయిల్ సైన్యం వెల్లడించింది. బెకా లోయలో ఓ అపార్ట్మెంట్ భవనంపై దాడి చేసినట్లు, రెస్క్యూ ఆపరేషన్స్ చేపట్టి.. మంటల్ని అదుపుచేస్తూ… ఆ శిథిలాల్లో ప్రాణాలతో బటయపడిన వారి కోసం సిబ్బంది వెతుకుతున్నట్లు స్థానిక మీడియా టెలివిజన్ ఫుటేజ్లో కనిపిస్తుంది.
కాగా, శుక్రవారం లెబనాన్లో సిడోన్ నగరంలో పాలస్తీనా శరణార్థుల శిబిరంపై ఇజ్రాయిల్ సైన్యం దాడి చేయగా.. ఈ దాడిలో ఇద్దరు మృతి చెందారు. సిడోన్లో హమాస్ కమాండ్ సెంటర్ని లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడినట్లు ఇజ్రాయిల్ సైన్యం పేర్కొంది.



