- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : జనగామ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్తో లైన్మెన్ కరుణాకర్ మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన చీటకోడూరు గ్రామంలో చోటు చేసుకుంది. కరుణాకర్ ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్తో అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కరుణాకర్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
- Advertisement -



