Saturday, June 27, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంవెనిజులాలో మరోసారి భూకంపం

వెనిజులాలో మరోసారి భూకంపం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : వెనిజులాలో మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 4.9గా నమోదైంది. రెండు రోజుల క్రితం వరుసగా సంభవించిన రెండు భారీ భూకంపాల ధాటికి దేశంలో తీవ్ర విధ్వంసం చోటుచేసుకుంది. ఈ విపత్తులో 920 మంది మృతి చెందగా, 3 వేల మందికి పైగా గాయపడ్డారు. శిథిలాల కింద ఇంకా పలువురు చిక్కుకుపోయి ఉండొచ్చనే అనుమానంతో సహాయక బృందాలు యుద్ధ ప్రాతిపదికన రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగిస్తున్నాయి. తాజా భూకంపంతో ప్రజల్లో మరోసారి భయాందోళనలు నెలకొన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -