- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : కడప నగర పరిధిలోని పాలెంపల్లె బైపాస్ వద్ద శుక్రవారం రాత్రి రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు క్షతగాత్రులను అంబులెన్స్లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు అప్పటికి ముగ్గురు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
- Advertisement -



