Saturday, June 27, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమూసీ రివర్ ఫ్రంట్‌పై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

మూసీ రివర్ ఫ్రంట్‌పై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : మూసీ రివర్ ఫ్రంట్‌పై అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇవ్వాలని సూచించారు. భూసేకరణలో భాగంగా ఆసక్తి ఉన్నవాళ్లకు టీడీఆర్ ఇవ్వాలన్నారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు డిఫెన్స్ భూముల్లో నిర్మాణాలను తరలించాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. మూసీ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ను నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రాజెక్టులో చేపట్టబోయే పనులు సెంటర్‌లో ప్రతిబింబించాలని సూచించారు. మూసీ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌పై ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -