Wednesday, February 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామాభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర కీలకం 

గ్రామాభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర కీలకం 

- Advertisement -

ఎంపీడీఓ రవీశ్వర్ గౌడ్ 
నవతెలంగాణ – నసురుల్లాబాద్ 

గ్రామ పంచాయతీలో ప్రతి వార్డుకు ఒక ప్రతినిధిగా ఒక వార్డు సభ్యుడు ఉంటారని, గ్రామీణాభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర ఎంతో కీలకమని నసురుల్లాబాద్ ఎంపీడీఓ రవీశ్వర్ గౌడ్ అన్నారు. నూతనంగా ఎన్నికైన 19 గ్రామ పంచాయతీ వార్డు సభ్యులకు 5 రోజుల శిక్షణ కార్యక్రమం కొనసాగుతుంది. ఇందులో భాగంగా బుదవారం  నసురుల్లాబాద్ మండల కేంద్రం లోని రైతువేధికలో శిక్షణ తరగతుల సందర్భంగా ఎంపీడీఓ రవీశ్వర్ మాట్లాడుతూ వార్డుమెంబర్లకు పంచాయతీరాజ్‌ వ్యవస్థ కీలక మైన బాధ్యతలు కట్టబెట్టిందన్నారు.

వార్డుల్లో సమస్యలు గుర్తించి పరిష్క రించడంలో చురుగ్గా వ్యవహరించాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరేలా కృషి చేయాలన్నారు. పంచాయతీరాజ్‌ చట్టం, గ్రామసభల నిర్వహణ, ఆర్థిక వ్యవహారాలు, అభివృద్ధి పథకాల అమలు, రికార్డుల నిర్వహణ తదితర అంశాలపై వార్డు సభ్యులకు మాస్టర్‌ ట్రైనర్ల ద్వారా అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. వార్డు సభ్యులు శిక్షణ తరగతులను సద్వినియోగం చే సుకోవాలని కోరారు. మండల పంచాయతీ అధికారి సూర్యకాంత్, శిక్షణ నిర్వాహకులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు ,వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -