- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : EPFO తమ పోర్టల్, ఉమాంగ్ యాప్లలో ఆన్లైన్ క్లెయిమ్ సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ కారణంగా జూన్ 28 అర్ధరాత్రి వరకు పీఎఫ్ పోర్టల్ సేవలు నిలిచిపోతాయి. ఈ సమయంలో కొత్త క్లెయిమ్లు చేయలేరు, పాతవి కూడా ప్రాసెస్ కావు. జూన్ 29 నుండి పోర్టల్ సేవలు పునఃప్రారంభమవుతాయి. అయితే, ఉమాంగ్ యాప్లో పీఎఫ్ సేవలు జులై 2 వరకు అందుబాటులో ఉండవు. దీనివల్ల లక్షలాది మంది పీఎఫ్ ఖాతాదారులు ఇబ్బందులు ఎదుర్కోనున్నారు.
- Advertisement -



