- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఫుల్లెర్టన్లో జరిగిన యూఎస్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో భారత ఆటగాడు కిదాంబి శ్రీకాంత్ రన్నరప్గా నిలిచాడు. ఆదివారం జరిగిన పోరులో తైపీకి చెందిన సు లి-యాంగ్తో మూడు గేమ్లలో పోరాడి ఓడిపోయాడు. 2021 ప్రపంచ ఛాంపియన్షిప్లో రజత పతకం సాధించిన శ్రీకాంత్, తొలిగేమ్లో ఓడినా పుంజుకున్నాడు. అయితే, తనకంటే తొమ్మిదేళ్లు చిన్నవాడైన సు లి-యాంగ్ చేతిలో ఓటమి పాలయ్యాడు.
- Advertisement -



