నవతెలంగాణ – హైదరాబాద్ : అమెరికా తన 250వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వాషింగ్టన్లో నిర్వహించాల్సిన సాంప్రదాయ స్వాతంత్ర్య దిన పరేడ్ను తీవ్ర వేడి కారణంగా రద్దు చేశారు. ఈ ఉదయం జరగాల్సిన ఈ పరేడ్ అత్యధిక ఉష్ణోగ్రత వల్ల రద్దు అయిందని నిర్వాహకులు ప్రకటించారు. జాతీయ వాతావరణ సంస్థ ప్రకారం, సుమారు 16 కోట్ల అమెరికన్లు తీవ్ర వేడి హెచ్చరికలు (ఎక్స్ట్రీమ్ హీట్ వార్నింగ్స్) ఎదుర్కొంటున్నారు. తూర్పు అమెరికాలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాషింగ్టన్లోని నేషనల్ మాల్లో జరిగే ఉత్సవాలు కూడా వేడి తీవ్రత కారణంగా మధ్యాహ్న భాగం రద్దు చేయాల్సి వచ్చింది.
మరోవైపు, వేడిమికి తట్టుకోలేక అస్వస్థతకు గురైన ఒక యువతిని ఆసుపత్రికి తరలించారు. గ్రేట్ అమెరికన్ స్టేట్ ఫేర్ కార్యక్రమాన్ని కూడా తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. న్యూయార్క్లో హీట్ ఇండెక్స్ 105 ఫారెన్హీట్ (41 డిగ్రీల సెల్సియస్)కి చేరుకుంది. విద్యుత్ గ్రిడ్లపై భారీ ఒత్తిడి పడుతోంది. వేలాది మందికి విద్యుత్ సరఫరా ఆగిపోయింది. ఈ తీవ్ర వేడి అమెరికా స్వాతంత్ర్య దినోత్సవాలు, ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్లు, విద్యుత్ వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.



