- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : పుణెలో యువ రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అతడి ఇంట్లో మరో విషాదం నెలకొంది. కేతన్ తాత దేవీచంద్ అగర్వాల్ (71) మృతి చెందారు. మనవడు మరణించినప్పటి నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి దిగజారినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి గుండెపోటుతో మృతి చెందినట్లు తెలిపారు. మరోవైపు కేతన్ హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
- Advertisement -



