నవతెలంగాణ – హైదరాబాద్ : తిరుమల శ్రీవారి దర్శనానికి రాబోయే మూడు నెలల్లో ప్రయాణ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న భక్తులకు టీటీడీ ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. జులై 14- కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం. జులై 17- ఆణివార ఆస్థానం. జులై 19- శ్రీ ఆండవన్ ఆశ్రమ స్వామీజీకి పెద్ద మర్యాద. జులై 29- జీయర్ స్వాముల చాతుర్మాస సంకల్పం. ఆగస్టు 22- పవిత్రోత్సవాలకు అంకురార్పణ. ఆగస్టు 24- పవిత్రోత్సవాల రెండోరోజు సందర్భంగా పవిత్రాల సమర్పణ. సెప్టెంబర్ 8- శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం. సెప్టెంబర్ 14- బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ. సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ముఖ్యంగా సిఫార్సు లేఖలపై ఆధారపడి దర్శనానికి వచ్చే భక్తులు, ఈ మార్పులను గమనించి తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని సూచించింది.
తిరుమలలో ఈ తేదీల్లో వీఐపీ దర్శనాలు రద్దు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



