Saturday, March 7, 2026
E-PAPER
Homeతాజా వార్తలునిన్నంటి మ్యాచ్‌లో హీరోలు..!

నిన్నంటి మ్యాచ్‌లో హీరోలు..!

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: చిరుకాల ప్ర‌త్య‌ర్థిపై సాధించిన విజ‌యం కంటే..గురువారం వాంఖ‌డే స్టేడియం వేదిక‌గా జ‌రిగిన రెండో సెమీ పోరులో క్రికెట్ అభిమానుల‌కు అస‌లు కిక్కు ల‌భించింది. ఇరుజ‌ట్ల నువ్వా-నేనా అనే త‌ర‌హాలో ప‌రుగుల సునామీ సృష్టించాయి. కానీ అంతిమంగా 7 ప‌రుగుల తేడాతో టీమిండియా గ్రాండ్ విక్ట‌రీ సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. మార్చి8న అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రిగే తుదిపోరులో న్యూజిలాండ్‌తో త‌ల‌ప‌డ‌నుంది. ఇదంతా బాగానే ఉన్నా.. ఇరు జ‌ట్ల‌లో ప‌లువురు ప్లేయ‌ర్లు జ‌గ‌మెరిగిన హీరోలైయ్యారు. ముందుగా టీమిండియా నుంచి చూస్తే బ్యాటింగ్ ప‌రంగా సంజు సామ్స‌న్ కాగా, బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫిల్లిండ్ ప‌రంగా అక్ష‌ర్ ప‌టేల్, బౌలింగ్‌లో బుమ్రా అన‌డం ఆతిశ‌యోక్తి కాదు.

టోర్నీ ప్రారంభం నుంచి మంచి ఫామ్‌లో ఉన్నా అభిషేక్, ఇషాన్ కిషాన్ త‌క్కువ ప‌రుగుల‌కే పెవిలియ‌న్ చేరినా..సంజు సామ్స‌న్ మాత్రం ఆడాల్సిన ఆట‌లో త‌న స‌త్తా ఏంటో చూపించాడు. సెమీస్‌కు అర్హ‌త సాధించాల్సిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై అర్ధ సెంచ‌రీతో ఆదుకున్న సంజు..అదే ఉత్త‌మప్ర‌ద‌ర్శ‌న‌తో ఇంగ్లాండ్‌ఫై జ‌రిగిన సెకండ్ సెమీ ఫైట్‌లో 89 ర‌న్స్‌తో టీమిండియా భారీ స్కోర్‌కు బాట‌లు వేశాడు.

ఇక చేధ‌న‌కు దిగిన ఇంగ్లాండ్‌ను బౌలింగ్‌, ఫీల్డింగ్‌తో భారీగా దెబ్బ‌తీశాడు అక్ష‌ర్ ప‌టేల్. మెరుపు వేగంతో రెండు కీల‌క అందుక‌న్నాడు. ఆ క్యాచ్‌లే టీమిండియాకు మ్యాచ్ విన్న‌ర్‌కు దోహ‌దం చేశాయి. ముందుగా బుమ్రా వేసిన నాల్గో ఓవ‌ర్లో బ్రూక్ భారీ షాట్ స్క్వేర్ లెంగ్ దిశ‌గా బంతిని గాల్లోకి కొట్టాడు..జెట్ స్పీడ్‌తో ప‌రుగెత్తిన అక్ష‌ర్ ఆ బాల్ ప‌ట్టుకున్నాడు. దీంతో భీక‌ర్ పామ్‌లో ఉన్నా బ్రూక్ ఔట్ అయ్యాడు. అక్ష‌ర్ వేసిన ఏడో ఓవ‌ర్ రెండో బాల్‌కు టాండ‌న్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు.

ఇక ఆట‌లోనే అద్భుత క్యాచ్ ఆన‌డంలో ఎలాంటి సందేహాంలేదు. ఆర్ష‌దీప్ వేసిన 13 ఓవ‌ర్లో ఐదో బంతిని జాక్ కొట్టిన బాల్‌ను వాయువేగంతో వ‌చ్చి ప‌ట్టుకొని దగ్గ‌ర‌లో ఉన్న దూబేకు రిలే క్యాచ్ ఇచ్చాడు. ఆ క్యాచ్‌లే టీమిండియాకు మ్యాచ్ విన్న‌ర్‌కు దోహ‌దం చేశాయి.

బుమ్రా త‌న అనుభ‌వాన్ని చూపించాడు. జ‌ట్టులో సీనియ‌ర్ స‌భ్యుడిగా ఉండి టీమిండియాకు కావాల్సిన స‌మ‌యంలో వికెట్లు తీయ‌డంతో దిట్ట అని నిరూపించుకున్నాడు. త‌న వేసిన మొద‌టి ఓవ‌ర్లోనే ఫామ్‌లో ఉన్న‌ ఇంగ్లాండ్ జ‌ట్టు కెప్టెన్ బ్రూక్‌ను ఔట్ చేశాడు. ఒక దశలో జాకబ్ బెథెల్ అద్భుత సెంచరీతో ఇంగ్లండ్ సులువుగా గెలిచేలా కనిపించింది. చివరి మూడు ఓవర్లలో భారత బౌలర్లు అద్భుతం చేశారు. జస్‌ప్రీత్ బూమ్రా 18వ ఓవర్లో కేవలం 6 పరుగులే ఇచ్చి ఇంగ్లండ్‌పై తీవ్ర ఒత్తిడి పెంచాడు.

ఇంగ్లాండ్ టీంలో బెత‌ల్ పోరాట తీరు అద్భుతం ఓ వైపు కీల‌క వికెట్లు ప‌డుతున్నా..త‌న దూకుడు త‌గ్గించ‌లేదు. త‌న వీరోచిత‌ సెంచరీతో ఇంగ్లండ్‌కు గెలుపును ద‌గ్గ‌ర చేశాడు. చివ‌రి ఓవ‌ర్లో ర‌నౌట్ కావ‌డంతో అతని ముగిసిపోయింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -