- Advertisement -
నవతెలంగాణమద్నూర్
డోంగ్లి మండలంలోని ఏనబోరా అంగన్వాడి కేంద్రంలో ఆ గ్రామ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి జిల్లా నాయకులు యూనుస్ పటేల్ గురువారం చిన్నారులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యాభివృద్ధికి కట్టుబడి ఉందని, అంగన్వాడీల విద్యాభివృద్ధికి కృషి చేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్, ఆ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -



