- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:21 గంటల సమయంలో సెన్సెక్స్ 694 పాయింట్లు ఎగబాకగా, నిఫ్టీ 197 పాయింట్లు లాభపడింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు, కొనుగోళ్ల ఊపు సూచీలకు బలాన్నిచ్చాయి. మరోవైపు డాలర్తో పోలిస్తే రూపాయి 25 పైసలు బలపడి ప్రస్తుతం రూ.95.23 వద్ద ట్రేడవుతోంది. దీంతో ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడిదారుల సెంటిమెంట్ మరింత మెరుగుపడింది.
- Advertisement -


