- Advertisement -
బెంగళూరు : ఏఐ పెట్టుబడుల నుంచి మెరుగైన వ్యాపార ఫలితాలను రాబట్టేందుకు కాగ్నిజెంట్ సంస్థ తన ఫ్రాంటియర్ వర్క్ఫోర్స్ను విస్తరించనున్నట్టు తెలిపింది. ఇందులో భాగంగా 5,000 మంది ఫ్రాంటియర్ ఇంజనీర్లు, 10,000 మంది ఫ్రాంటియర్ బిజినెస్ ఆపరేటర్లను సిద్ధం చేయనున్నట్టు ప్రకటించింది. సాంకేతికత, వ్యాపార ఫలితాల మధ్య ఉన్న సుమారు 4.5 ట్రిలియన్ డాలర్ల అంతరాన్ని పూడ్చడమే తమ లక్ష్యమని, దీనికోసం ఈ ఏడాది చివరి నాటికి మొదటి బ్యాచ్ను రంగంలోకి దించనున్నట్టు కాగ్నిజెంట్ సీఈఓ రవి కుమార్ తెలిపారు.
- Advertisement -


