Thursday, July 9, 2026
E-PAPER
Homeబీజినెస్తెలంగాణ గవర్నర్ ను కలిసిన అలోక్ కుమార్ అగర్వాల్

తెలంగాణ గవర్నర్ ను కలిసిన అలోక్ కుమార్ అగర్వాల్

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : కెనరా బ్యాంక్ ‘స్ట్రాటజీ, రీసోర్సెస్ & గవర్నమెంట్ సర్వీసెస్’ వింగ్ చీఫ్ జనరల్ మేనేజర్ అలోక్ కుమార్ అగర్వాల్, అలాగే హైదరాబాద్ సర్కిల్ హెడ్, చీఫ్ జనరల్ మేనేజర్ కళ్యాణ్ ముఖర్జీ.. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సమావేశంలో, బ్యాంక్ సాధిస్తున్న పటిష్టమైన వ్యాపార వృద్ధితో పాటు.. ఆర్థిక సమ్మిళితాన్ని ప్రోత్సహించడానికి, డిజిటల్ పరివర్తనను వేగవంతం చేయడానికి మరియు సుస్థిర ఆర్థికాభివృద్ధికి అండగా నిలవడానికి కెనరా బ్యాంక్ చేపట్టిన వ్యూహాత్మక కార్యక్రమాలను చీఫ్ జనరల్ మేనేజర్ గౌరవ గవర్నర్‌కు వివరించారు.

ఈ భేటీ.. రాబోయే రోజుల్లో సంస్థాగత సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి మరియు సన్నిహిత సహకారాన్ని పెంపొందించడానికి మార్గం సుగమం చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -