హైదరాబాద్ : ప్రముఖ ఏఐ రిలయబిలిటీ ఇంజనీరింగ్, డిజిటల్ అస్సూరెన్స్ సంస్థ ‘క్వాలిటీకియోస్క్ టెక్నాలజీస్’ హైదరాబాద్లోని ఐటీ కారిడార్ హైటెక్ సిటీలో ఉన్న ‘ది స్కైవ్యూ’ ప్రాంగణంలో తన నూతన ఇంజినీరింగ్ హబ్ను సిఇఒ మనీష్ ఝావర్, సిఎంఓ సాయిరాం వేదం, పరిశ్రమ నిపుణుల సమక్షంలో ప్రారంభమైంది. ఈ కేంద్రం ఫైనాన్షియల్ జీసీసీలు, బ్యాంకింగ్, ఫార్మా రంగానికి సేవలు
అందిస్తున్న 40 మందికి పైగా ఉన్న స్థానిక బృందాన్ని మరింత విస్తరించేందుకు తోడ్పడనుంది. హైదరాబాద్లో వేగంగా పెరుగుతున్న ఏఐ ఇన్నోవేషన్, గ్లోబల్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవసరాలను తీర్చడానికే ఈ కేంద్రంలో పెట్టుబడులు పెట్టామని, నగరంలో లభించే అద్భుతమైన ప్రతిభ తమ సంస్థ విస్తరణకు ఎంతగానో దోహదపడుతుందని కంపెనీ సిఇఒ మనీష్ ఝావర్ తెలిపారు.
హైదరాబాద్లో క్వాలిటీకియోస్క్ కొత్త ఇంజినీరింగ్ హబ్ ప్రారంభం
- Advertisement -
- Advertisement -



