నవతెలంగాణ – హైదరాబాద్: భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన డిజైన్ ఫెస్టివల్ అయిన డిజైన్ డెమోక్రసీ, తమ ప్రతిష్టాత్మక కార్యక్రమం యొక్క నాలుగవ ఎడిషన్ను ఈరోజు ప్రకటించింది. ఇది 18-19-20 సెప్టెంబర్ 2026 తేదీలలో హైదరాబాద్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరగనుంది. గత మూడు సంవత్సరాలుగా, ఆర్కిటెక్చర్, ఇంటీరియర్స్, ఫర్నిచర్, ప్రొడక్ట్ డిజైన్, లైటింగ్, ఫర్నిషింగ్స్, యాక్సెసరీస్, ఆర్ట్ మరియు హస్తకళల కోసం భారతదేశంలోని అత్యంత ప్రభావవంతమైన వేదికలలో ఒకటిగా డిజైన్ డెమోక్రసీ తనను తాను నిలబెట్టుకుంది. 2026 ఎడిషన్ ఇప్పటివరకు జరిగిన వాటిలోకెల్లా అతిపెద్దదిగా, అత్యంత లీనమయ్యే అనుభూతిని అందించేదిగా నిలువనుందనే వాగ్దానం చేస్తోంది. ఇది దేశవ్యాప్తంగా 200కు పైగా ప్రముఖ డిజైన్ బ్రాండ్లను, 150 మందికి పైగా వక్తలను, మరియు 30,000 మందికి పైగా సందర్శకులను ఒకచోట చేర్చనుంది.
కాన్వాస్, మ్యూజ్, అటెలియర్ మరియు ఆల్కెమీ అనే నాలుగు విభిన్నమైన హాళ్లలో విస్తరించి వుండే ఈ ఉత్సవం, ప్రదర్శనలు, ఇన్స్టాలేషన్లు, సంభాషణలు మరియు ప్రత్యేకంగా రూపొందించిన అనుభవాల ద్వారా డిజైన్లోని అత్యుత్తమమైన వాటిని ప్రదర్శిస్తుంది. ఈ సంవత్సరపు ఎడిషన్, డిజైన్ మరియు సృజనాత్మకత యొక్క ప్రత్యేక కోణాన్ని చాటిచెప్పే అసాధారణమైన క్యూరేటెడ్ ఎగ్జిబిషన్ల శ్రేణిని పరిచయం చేస్తోంది. వీటిలో…
· డిజైన్ హౌస్కు చెందిన సుప్రజ రావుచే క్యూరేట్ చేయబడిన మ్యూజియం ఆఫ్ తెలంగాణ.
· మ్యూజ్ల్యాబ్కు చెందిన జసేమ్ పిరానీ & హుజెఫా రంగ్వాలాచే క్యూరేట్ చేయబడిన గ్యాలరీ ఆఫ్ సస్టైనబిలిటీ.
· హ్యాబిటాట్ ఆర్కిటెక్ట్స్కు చెందిన మోనికా & సారా చౌదరిచే క్యూరేట్ చేయబడిన ప్రెషియస్ ఆబ్జెక్ట్స్.
· సాక్షి ఆర్ట్ గ్యాలరీ సహకారంతో అనీష్ గవాండేచే క్యూరేట్ చేయబడిన ది ఆర్ట్ ఎడిట్.
· గౌరాంగ్ షా, రింపిల్ & హర్ప్రీత్, దివానీ మరియు యావి వంటి ప్రసిద్ధ డిజైనర్లు పాల్గొంటుండగా వారసత్వం, పనితనం మరియు ఆవిష్కరణల సంగమాన్ని అన్వేషించే రీతిలో ఒక కొత్త , లీనమయ్యే టెక్స్టైల్ షోకేస్, ది ఫ్యాబ్రిక్ ఆఫ్ డిజైన్… వంటివి వున్నాయి.
ఈ ఫెస్టివల్లో డిడి టాక్స్ మరియు డిడి ఫోకస్ కూడా ఉంటాయి. ఇవి డిజైన్ భవిష్యత్తుపై కీలకోపన్యాసాలు , ప్యానెల్ చర్చల కోసం 150 మందికి పైగా ఆర్కిటెక్ట్లు, డిజైనర్లు, కళాకారులు, పారిశ్రామికవేత్తలు, మేధావులను ఒకచోట చేర్చుతాయి. ముఖ్య వక్తలలో అల్ఫాజ్ మిల్లర్, రవీందర్ రెడ్డి, సందీప్ ఖోస్లా, అంకోన్ మిత్రా, సుసానే ఖాన్ తదితరులు ఉన్నారు.
ఈ అనుభవానికి మరింత శోభను చేకూర్చేలా భారీ బహిరంగ కళాకృతుల ఏర్పాటు, అనుభవాత్మక ప్రదర్శనలు, నెట్వర్కింగ్ కార్యక్రమాలు , కేఫ్లు, కాన్సెప్ట్ కిచెన్లు, క్రాఫ్ట్ బార్లతో కూడిన ప్రత్యేకంగా రూపొందించిన పాకశాస్త్ర గమ్యస్థానమైన ‘ది గౌర్మెట్ జోన్’ కూడా ఉంటాయి.
నాల్గవ ఎడిషన్ గురించి డిజైన్ డెమోక్రసీ సహ-వ్యవస్థాపకురాలు పల్లికా శ్రీవాస్తవ్ మాట్లాడుతూ “గొప్ప డిజైన్కు స్ఫూర్తినిచ్చే, అనుసంధానించే , ప్రజలను ఏకం చేసే శక్తి ఉందనే ఒక సాధారణ నమ్మకంతో డిజైన్ డెమోక్రసీ పుట్టింది. గత కొద్ది సంవత్సరాలుగా ఇది ఆలోచనలను పంచుకునే, భాగస్వామ్యాలను పొందించుకునే, సృజనాత్మకతను వేడుకగా జరుపుకునే ఒక గొప్ప వేదికగా ఎదిగింది. మేము నాల్గవ ఎడిషన్కు స్వాగతం పలుకుతున్న వేళ కూడా భారతీయ డిజైన్ను ప్రోత్సహించే , దాని భవిష్యత్తును తీర్చిదిద్దే వ్యక్తులను ఒకచోట చేర్చే ఒక పర్యావరణ వ్యవస్థను నిర్మించడమనే మా నిబద్ధత ఏమీ మారలేదు” అని అన్నారు.
డిజైన్ డెమోక్రసీ సహ-వ్యవస్థాపకురాలు శైలజా పట్వారీ మాట్లాడుతూ “భారతదేశపు డిజైన్ ప్రస్థానం, ఆ దేశం లాగే సాహసోపేతమైన , వైవిధ్యమైన వేదికను పొందేందుకు అర్హమైనది. ప్రతి ఎడిషన్తో, మేము కేవలం ఒక ఉత్సవాన్ని నిర్మించడం లేదు; సమిష్టిగా ఆలోచించే, ప్రశ్నించే మరియు సృష్టించే ఒక సమాజాన్ని పెంపొందిస్తున్నాము. డిజైన్ డెమోక్రసీ 2026 ఇప్పటివరకు మా అత్యంత ప్రతిష్టాత్మకమైన అధ్యాయంలలో ఒకటిగా నిలుస్తుంది. దేశంలోని డిజైన్ కమ్యూనిటీకి మరోసారి స్వాగతం పలకడానికి మేము ఎదురుచూస్తున్నాము”అని అన్నారు.
డిజైన్ డెమోక్రసీ సహ-వ్యవస్థాపకుడు అర్జున్ రాఠీ మాట్లాడుతూ “జిజ్ఞాసను మరియు అర్థవంతమైన సంభాషణలను సాధ్యం చేసే అనుభవాలను సృష్టించడమే డిజైన్ డెమోక్రసీ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. భారతీయ డిజైన్ యొక్క వైభవం, వైవిధ్యం , భవిష్యత్తును చాటిచెప్పేలా ప్రతి ప్రదేశం, ప్రతి ఇన్స్టాలేషన్, ప్రతి సంభాషణ ఎంతో ఆలోచనాత్మకంగా రూపొందించబడ్డాయి” అని అన్నారు.
డిజైన్ డెమోక్రసీ 2026కు పరిశ్రమలోని అత్యంత గౌరవనీయమైన భాగస్వాములు మద్దతు ఇస్తున్నారు. ది చార్కోల్ ప్రాజెక్ట్ టైటిల్ స్పాన్సర్గా వ్యవహరిస్తుండగా ప్లాటినం స్పాన్సర్గా బ్యూటిఫుల్ హోమ్స్ బై ఏషియన్ పెయింట్స్, వీఐపీ లాంజ్ స్పాన్సర్ గా గౌరీ ఖాన్ డిజైన్స్, గోల్డ్ స్పాన్సర్గా బాండ్టైట్ అడెసివ్స్, సిల్వర్ స్పాన్సర్గా టెక్నోజిమ్ చేరగా, స్పెక్టా, డిమోర్ , మ్యాగ్పై మరియు సన్రూఫ్ లు అసోసియేట్ స్పాన్సర్లుగా జతకట్టాయి. శాటిలైట్ పార్టీని క్యూస్ నిర్వహిస్తుండగా, లాంచ్ పార్టీ పార్టనర్గా వోక్స్ వ్యవహరిస్తోంది , తెలంగాణ మ్యూజియం స్పాన్సర్ గా బ్రౌన్ ప్రొఫైల్స్ వ్యవహరిస్తోంది.
వీటితో పాటు, ‘డిజైన్ డెమోక్రసీ 2026’ లో అజూరా సెరామికా, న్యూఫామ్, జుచెట్టి వంటి అంతర్జాతీయ లగ్జరీ బ్రాండ్లు మరియు ఎసెన్షియా హోమ్స్, దివియానా, RAVOH, సీతా నంద, సిటోలియా, కాసా ఇంటీరియో వంటి ప్రముఖ భారతీయ డిజైన్ సంస్థలు కూడా ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
ప్రజల కోసం డిజైన్. కమ్యూనిటీచే శక్తివంతం చేయబడింది.
కార్యక్రమ వివరాలు: డిజైన్ డెమోక్రసీ 2026
18-19-20 సెప్టెంబర్ 2026
హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్, హైదరాబాద్
డిజైన్ డెమోక్రసీ గురించి
2023లో స్థాపించబడిన డిజైన్ డెమోక్రసీ, భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన డిజైన్ ఫెస్టివల్. ప్రతి సంవత్సరం హైదరాబాద్లో జరిగే ఈ ఫెస్టివల్, ప్రత్యేకంగా రూపొందించిన ప్రదర్శనలు, లీనమయ్యే ఇన్స్టాలేషన్లు, స్ఫూర్తిదాయకమైన సంభాషణలు మరియు సాంస్కృతిక అనుభవాల ద్వారా దేశంలోని ప్రముఖ ఆర్కిటెక్ట్లు, డిజైనర్లు, కళాకారులు, బ్రాండ్లు మరియు మేకర్స్ను ఒకచోట చేర్చుతుంది.
ఒక పండుగకు మించి, డిజైన్ డెమోక్రసీ అనేది సృజనాత్మకతను వేడుకగా జరుపుకునే, సహకారాన్ని పెంపొందించే మరియు భారతదేశం యొక్క అభివృద్ధి చెందుతున్న డిజైన్ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేసే ఒక వేదిక.



