- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా, ఇరాన్లు మళ్లీ దాడులు, ప్రతిదాడులకు పాల్పడుతున్నాయి. ఇరాన్ నౌకాశ్రయాలే లక్ష్యంగా అమెరికా దాడులు చేయగా, హర్మూజ్ జలసంధిలో రెండు యూఏఈ ట్యాంకర్లపై ఇరాన్ దాడులు చేసింది. ఈ దాడుల్లో ఓ భారతీయుడు మృతి చెందగా, మరో ఆరుగురు భారతీయులు, ఇద్దరు ఉక్రెయిన్వాసులు గాయపడ్డారు. ఈనేపథ్యంలో హర్మూజ్లో నౌకల రాకపోకలను నిర్బంధిస్తున్నట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ అధికారులు వెల్లడించారు.
- Advertisement -



