- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఈశాన్య భారతదేశంలో భద్రతా దళాలపై దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. నాగాలాండ్లోని చుమౌకెడిమా పరిధిలో గల సుఖోయ్ ప్రాంతంలో అస్సాం రైఫిల్స్ కాన్వాయ్ సమీపంలో అనుమానిత పేలుడు పదార్థం (IED) పేలింది. ఈ ఘటనలో ఒక జవాన్ మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారం రోజుల వ్యవధిలోనే అస్సాం రైఫిల్స్ కాన్వాయ్ లక్ష్యంగా దాడి చేయడం ఇది రెండవసారి. భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని దిగ్బంధించి, అనుమానిత ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి.
- Advertisement -



