- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : భారత సంతతికి చెందిన నాసా ఆస్ట్రోనాట్ డాక్టర్ అనిల్ మీనన్ ఈరోజు రాత్రి కజకిస్థాన్లోని బైకనూర్ కాస్మోడ్రోమ్ నుంచి సోయజ్ ఎంఎస్-29 వ్యోమనౌకలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయలుదేరనున్నారు. భారత కాలమానం ప్రకారం రాత్రి 8:17 గంటలకు ప్రారంభమయ్యే ఈ 8 నెలల యాత్రలో, అంతరిక్షంలో సుదీర్ఘకాలం మానవులు గడిపితే ఎదురయ్యే వైద్యపరమైన సవాళ్లపై పరిశోధనలు చేస్తారు. ఈ పరిశోధనల ఫలితాలు భవిష్యత్తులో చేపట్టబోయే సుదూర అంతరిక్ష యాత్రలకు కీలకం కానున్నాయి. ఆయనతోపాటు రష్యన్ వ్యోమగాములు కూడా పాల్గొంటున్నారు.
- Advertisement -



