- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : వరంగల్ (మామునూరు) ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనులను వేగవంతం చేస్తామని కేంద్ర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. మరో 3 వారాల్లో పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వం రికార్డు స్థాయిలో 253 ఎకరాల భూమిని సేకరించడాన్ని ఆయన అభినందించారు. కాకతీయ కళా వైభవంతో నిర్మించే ఈ ఎయిర్పోర్టును 2028, జూన్ 2 నాటికి పూర్తి చేస్తామన్నారు. అలాగే ఆదిలాబాద్లో డిఫెన్స్-సివిలియన్ ఎయిర్ పోర్ట్ నిర్మిస్తామని మంత్రి వెల్లడించారు.
- Advertisement -



