- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్లో అర్ధరాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా సరూర్నగర్, ఉప్పల్, బండ్లగూడ, హయత్నగర్, చార్మినార్, నాంపల్లి, గోల్కొండతో సహా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోవడంతో పాటు లోతట్టు ప్రాంతాలలోని ఇళ్లలోకి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అత్యధికంగా సరూర్నగర్లో 112 మీమీ, ఉప్పల్లో 81.3 మీమీ, బండ్లగూడలో 79.5 మీమీ, హయత్నగర్లో 72.5 మీమీ వర్షపాతం నమోదైంది.
- Advertisement -



