- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : పరిగి నుండి హైదరాబాద్ వెళుతున్న ఆర్టీసీ బస్సులో సీటు కోసం ఇద్దరు మహిళల మధ్య జరిగిన గొడవ తీవ్రమైంది. మాటమాట పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. మొదట ఒక మహిళ దాడి చేయగా, ఆమెపై ముగ్గురు మహిళలు తిరిగి దాడి చేశారు. తోటి ప్రయాణికులు ఆపే ప్రయత్నం చేసినా వారు శాంతించలేదు. చివరికి బస్సు ఆపి వారిని శాంతింపజేశారు. ఫ్రీ బస్సు పథకం అమలులోకి వచ్చాక మహిళల ప్రయాణం పెరిగి, రద్దీ కారణంగా సీట్ల కొరత ఏర్పడి ఇలాంటి సంఘటనలు తరచుగా జరుగుతున్నాయి.
- Advertisement -


