- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : 2026 నీట్ ప్రశ్నపత్రం లీకేజీపై దర్యాప్తు చేపట్టిన సీబీఐ కీలక విషయాలు వెల్లడించింది. కెమిస్ర్టీ ప్రశ్నలు ఇచ్చేందుకు గాను పేపర్ సెట్టర్ పి.వి.కులకర్ణికి లాతూర్ కోచింగ్ సెంటర్ యజమాని శివ్రాజ్మోతేగాంకర్ రూ.5 లక్షలు ఇచ్చినట్లు పేర్కొంది. దీంతో శివ్రాజ్మోతేగాంకర్ను అరెస్టు చేసి అతని ఫోన్ను స్వాధీనం చేసుకున్నట్లు వివరించింది. అందులోని 136 చేతిరాత ప్రశ్నలలో, 111 ప్రశ్నలు ఎన్టీఏ రూపొందించిన ‘మాస్టర్ క్వశ్చన్ సెట్ల’తో సరిపోలాయని సీబీఐ ఢిల్లీ కోర్టుకు తెలిపింది.
- Advertisement -



