Wednesday, March 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పది పరీక్షలకు సర్వ సిద్ధం: డీఈఓ అశోక్

పది పరీక్షలకు సర్వ సిద్ధం: డీఈఓ అశోక్

- Advertisement -

నవతెలంగాణ – తుంగతుర్తి
ఈనెల 14 నుండి ఏప్రిల్ 16 వరకు పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులు సర్వం సిద్ధం చేసినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 69 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా.. అందులో 36 పరీక్షా కేంద్రాలు ప్రైవేట్ పాఠశాలల్లో, 33 పరీక్ష కేంద్రాలు ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ పరీక్షా కేంద్రాల్లో 12,364 మంది రెగ్యులర్, 39 మంది సప్లమెంటరీ విద్యార్థులు. మొత్తం12,403 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు తెలిపారు.

విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేరుకోవాలని, కేంద్రాల వద్ద విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, విద్యుత్ సదుపాయం, వైద్య సిబ్బంది, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. పరీక్షా కేంద్రం నుండి 100 మీటర్ల వరకు పోలీస్ బందోబస్తుతో పాటు 144 సెక్షన్ అమలు చేయడం జరుగుతుందని, పరీక్షలు జరుగుతున్న సమయంలో జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని తెలిపారు. పరీక్షలు ఉదయం 9:30 గంటల నుండి 12:30 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు గంట ముందుగానే చేరుకోవాలని, 9:35 దాటితే పరీక్షా కేంద్రంలోని అనుమతించరని తెలిపారు.

విద్యార్థులు, ఇన్విజిలేటర్లు పాటించాల్సిన నియమాలు: ప్రతి విద్యార్థి తప్పనిసరిగా హాల్ టికెట్ తో పరీక్షకు హాజరుకావాలని, ప్రశ్నాపత్రం పై హాల్ టికెట్ నెంబర్ వేయాలని, జవాబు పత్రంపై ఎక్కడ కూడా హాల్ టికెట్ నెంబర్ రాయవద్దని సూచించారు. పరీక్షా కేంద్రాల్లో విధులు నిర్వహించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఫోటో ఐడి కార్డు ధరించాలని తెలిపారు. సెల్ ఫోన్ ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్ష కేంద్రాలలోనికి తీసుకురాకూడదని, పరీక్ష సమయం పూర్తయ్యే వరకు విద్యార్థులు, సిబ్బంది పరీక్షా కేంద్రాన్ని విడిచి వెళ్ళకూడదని ఆదేశించారు.

పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సర్వం సిద్ధం: జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్.. పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను సమర్ధవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలను తీసుకుందని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పరీక్ష కేంద్రాలలో సీసీ కెమెరాల నిఘాలో ప్రశ్నాపత్రాలను తెరిచేలా, పరీక్ష అనంతరం సీల్ చేసేలా, ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 69 పరీక్ష కేంద్రాలలో 69 మంది చీఫ్ సూపర్డెంట్లు, 69 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్ల తోపాటు కుడకుడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు అదనంగా ఒక డిపార్ట్మెంటల్ అధికారిని నియమించినట్లు తెలిపారు.

ప్రతి పరీక్షా కేంద్రానికి ఒక సిటింగ్ స్కాడ్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని, జిల్లా వ్యాప్తంగా 640 మంది ఇన్జిలేటర్లను, 4 ఫ్లగ్ స్క్వాడ్ బృందాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఏ ఒక్కరికి కూడా సెల్ ఫోన్ అనుమతి లేదని, నిబంధనలు అతిక్రమించినట్లయితే కఠిన చర్యలు తప్పువని హెచ్చరించారు. హెల్ప్ లైన్ కోసం 9848809754 నెంబర్ ను సంప్రదించాలని సూచించారు. విద్యార్థులు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా, ప్రశాంతమైన వాతావరణంలో, ఏకాగ్రతతో పరీక్షలు రాసి మంచి విజయాన్ని సాధించి, తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -