- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలో యువతకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలు అందించేందుకు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పనులు వేగంగా జరుగుతున్నాయి. శుక్రవారం మంత్రి వివేక్ వెంకటస్వామి పనులను పరిశీలించి, వచ్చే విద్యా సంవత్సరం నుంచే 2,500 మంది విద్యార్థులతో అడ్మిషన్లు ప్రారంభమవుతాయని తెలిపారు. డిసెంబర్ సమ్మిట్ను ఈ యూనివర్సిటీలోనే నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోందని పేర్కొన్నారు. అక్టోబర్ చివరి నాటికి కీలక నిర్మాణాలను పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను మంత్రి ఆదేశించారు.
- Advertisement -



