- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: దేశంలో హైడ్రోజన్తో నడిచే తొలి రైలును ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. హర్యానాలోని జింద్-సోనిపట్ మధ్య 89 కిలోమీటర్ల మార్గంలో ఈ రైలు ప్రయాణించనుంది. ఉత్తర రైల్వేలో ప్రయోగాత్మక ప్రాజెక్టుగా దీనిని ప్రవేశపెట్టారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ సాంకేతికతను రైల్వేలో వినియోగిస్తున్నారు. హైడ్రోజన్ ద్వారా విద్యుదుత్పత్తి చేసి రైలును నడిపే ఈ సాంకేతికతను డీజిల్ ట్రైన్స్కు ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చారు. ఈ ప్రాజెక్ట్లో హైడ్రోజన్ నిల్వ, ఇంధనం నింపే ప్రత్యేక సదుపాయాలనూ ఏర్పాటుచేశారు.
- Advertisement -



