- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో లైంగికదాడికి గురైన నాలుగేళ్ల చిన్నారికి సరైన వైద్యం అందించడంలో విఫలమైన వైద్యులపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మార్చి 16న జరిగిన ఈ ఘటనలో, బాలికపై లైంగికదాడి జరిగిన తర్వాత రెండు ప్రైవేట్ ఆస్పత్రులు చికిత్స నిరాకరించాయి. చివరికి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే బాలిక మృతి చెందినట్లు నిర్ధారించారు. వైద్యులు, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేయలేదని సుప్రీంకోర్టు మండిపడింది. మృతురాలి కుటుంబానికి పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
- Advertisement -



