- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : జోర్డాన్లో ఉన్న అనేక అమెరికా యుద్ధ విమానాలు, రీఫ్యుయెలింగ్ విమానాలను ధ్వంసం చేసినట్లు ఇరాన్ వెల్లడించింది. మరికొన్ని ఫైటర్ జెట్లు తమ దాడుల్లో తీవ్రంగా దెబ్బతిన్నట్లు ప్రకటించింది. తమ దేశంపై అమెరికా చేసిన దాడుల్లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారని.. ఇందుకు ప్రతీకారంగా యుద్ధ విమానాలు ధ్వంసం చేసినట్లు ప్రకటించింది. జోర్డాన్ ప్రజలు అమెరికన్ల ప్రయోజనాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చింది. సిరియాలోని అమెరికా స్థావరంపై కూడా దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది.
- Advertisement -



