Saturday, July 18, 2026
E-PAPER
Homeజాతీయంబాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు

బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు

- Advertisement -
  • 8 మంది మృతి, 9 మందికి గాయాలు

నవతెలంగాణ-హైదరాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో శనివారం ఒక అక్రమ బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడులో కనీసం 8 మంది మరణించగా, 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను చికిత్స కోసం సివిల్ మణినగర్‌లోని ఎల్‌జీ (LG) ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే టాలెంట్ ఫైర్‌వర్క్స్ అనే ఈ పరిశ్రమ నగరంలోని వస్త్రాల్ ప్రాంతంలో ఉంది. దీని లైసెన్స్ రద్దయినప్పటికీ, ఒక వ్యవసాయ క్షేత్రంలో దీనిని నిర్వహిస్తున్నారు.

ఈ ప్రమాదంలో మరణించిన వ్యక్తి కుటుంబానికి PMNRF నుండి రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ. 50,000 నష్ట పరిహారం అందజేయనున్నట్లు ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -