- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : మెన్స్ టీ20 వరల్డ్ కప్ను మరింత విస్తరించేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రణాళికలు రచిస్తోంది. ప్రస్తుతం 20 జట్లతో జరుగుతున్న ఈ టోర్నీలో జట్ల సంఖ్యను 24కు పెంచే ఆలోచనలో ఐసీసీ ఉంది. క్రికెట్ను ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకోబోతున్నారు. 2032 ఎడిషన్ నుంచే ఈ కొత్త రూల్ అమలులోకి రానుంది. అసోసియేట్ దేశాలకు అవకాశాలు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, టోర్నమెంట్ షెడ్యూల్, మ్యాచుల సంఖ్య, ప్రసార హక్కులు, సరైన వేదికలను నిర్వహించడం ఐసీసీకి పెద్ద సవాలుగా మారనుంది. దశలవారీగా ఈ విస్తరణను చేపట్టి మొదట 24 జట్లతో ఆడి, వచ్చే ఫలితాలను బట్టి 32 జట్లకు పెంచనుంది.
- Advertisement -


