- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : సోషల్ మీడియాలో ఆగస్టు 25 నుంచి భారత్లో ఇన్స్టాగ్రామ్ను నిషేధిస్తారనే వార్త వైరల్ అవుతోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఈ ప్రచారం పూర్తిగా అవాస్తవమని, ఇన్స్టాగ్రామ్పై ఎలాంటి నిషేధ నిర్ణయం తీసుకోలేదని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం వెల్లడించింది. ప్రజలు తప్పుడు వార్తలను నమ్మవద్దని, ధృవీకరించకుండా ఇతరులకు పంపొద్దని సూచించింది. అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, మెటా కూడా ఇలాంటి ప్రకటన చేయలేదని పేర్కొంది. ప్రస్తుతం భారత్లో ఇన్స్టాగ్రామ్ యథావిధిగా పనిచేస్తోందని తెలిపింది.
- Advertisement -



